Do after eating : మన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మారుతున్న కాలానుగుణంగా మన వ్యవహార శైలి మార్చుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. భోజనం చేసిన తరువాత మనం కొన్ని పనులు చేయకూడదు. దీంతో తిన్న వెంటనే మనం చేయని పనులు ఉంటాయి. కానీ మనం పట్టించుకోం. వాటి వల్ల మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే మనం తిన్న వెంటనే చేయకూడని పనులు ఏంటో తెలుసుకుంటే మంచిది.
తిన్న వెంటనే పడుకోకూడదు. అలా చేస్తే మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ఆహారం తిన్న తరువాత స్నానం చేయకూడదు. దీని వల్ల కూడా అజీర్తి సమస్యలు వేధిస్తాయి. ఇలా మనం ఆహారం తిన్న తక్షణమే చేయకూడని పనులు ఉంటాయి. వాటిని తెలుసుకుని చేయకుండా ఉండటమే మంచిది.
భోజనం చేసిన తరువాత పండ్లు తినవద్దు. తిన్న తరువాత పండ్లు తింటే అందులో ఉండే పోషకాలు మనకు అందవు. దీంతో ఎప్పుడైనా భోజనం అనంతరం పండ్లు తినడానికి చొరవ చూపకండి. ఇంకా తిన్న వెంటనే వ్యాయామం చేయకూడదు. తిన్న తరువాత మన అవయవాలు తిన్న వాటిని అరిగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఆ సమయంలో మనం వ్యాయామం చేస్తే అజీర్తి సమస్య ఏర్పడవచ్చు.
భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. స్నానం చేశాకే తినాలి. ఇలా చేస్తే మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీవక్రియ కూడా మందగిస్తుంది. ఆరోగ్యానికి హాని కలగవచ్చు. కాఫీ, టీలు తాగకూడదు. కొందరు తిన్న తరువాత వీటిని తీసుకుంటారు. ఇది కరెక్టు కాదు. భోజనం చేసిన తరువాత కాఫీ, టీలు తాగడం వల్ల పోషకాలు అందకుండా పోతాయి.