41.2 C
India
Sunday, May 5, 2024
More

    Jyeshta Masam : జ్యేష్ట మాసం విశిష్టత ఏంటో తెలుసా?

    Date:

    Jyeshta Masam : తెలుగు వారు పంచాంగాన్ని నమ్ముతారు. మనకు పన్నెండు రాశులు, 27 నక్షత్రాలు, 6 తెలుగు నెలలు ఉంటాయి. ఇందులో చైత్రం మొదటిది కాగా ఫాల్గుణం ఆఖరుది. ఇందులో చైత్రం, వైశాఖం తరువాత వచ్చేది జ్యేష్టం. ఈ మాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జ్యేష్ట మాసంలో చేసే పూజలకు ప్రత్యేకత ఉంటుంది.

    జ్యేష్ట శుద్ధ దశమిని దశపాపహర దశమిగా చెబుతారు. పది రకాల పాపాలను పోగొట్టే దశమిగా భావిస్తారు. ఈ రోజు గంగానదిలో కానీ లేదా ఏదైనా నదిలో కానీ మూడు మునకలు వేయడం ఎంతో పుణ్యం. ఇంకా రజతంతో చేసిన తాబేలు, చేపలు, కప్పలు లాంటి జలచరాల ప్రతిమలు నీళ్లలో వేయడం మంచిది. నల్లనువ్వులు, బెల్లం, పేలపిండి వంటివి నదిలో వేయడం వల్ల పుణ్యం దక్కుతుంది.

    జ్యేష్ట శుద్ధ ఏకాదశిని నిర్మల ఏకాదశి అని కూడా పిలుస్తారు. పాయసం, పానకం, గొడుగు, నెయ్యి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. నిర్మల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే 12 ఏకాదశులకు సరిపడా పుణ్యం వస్తుంది. నదిలో స్నానం చేసినా ఇంట్లో స్నానం చేసినా గంగాదేవిని స్మరించి చేయడం వల్ల మంచి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

    జ్యేష్ట పౌర్ణమి తరువాత పదమూడో రోజున వటసావిత్రి వ్రతం మహిళలు చేస్తుంటారు. భర్తలు పదికాలాల పాటు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యంతో పది కాలాల పాటు బాగుండాలని ఈ వ్రతం చేస్తుంటారు. ఇలా జ్యేష్ట మాసంలో ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం. మనకు పుణ్యం దక్కాలని కోరుకుంటాం. ఇలా మన మాసాల్లో జ్యేష్ట మాసానికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related