Pushpa The Rule : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ సాదించుకున్నాడు. ఈయన నటన ముఖ్యంగా స్టైల్ అంటే అందరికి చాలా ఇష్టం.. ఇక పుష్ప సినిమాతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.. పుష్ప ది రైజ్ సినిమా 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది..
ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పుష్ప రిలీజ్ సమయంలో నార్త్ లో ఎలాంటి అంచనాలు లేవు.. కానీ రిలీజ్ తర్వాత పుష్పరాజ్ కు ప్రతీ ఒక్కరు ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఈ సినిమా కథ పార్ట్ 1 తోనే పూర్తి అవ్వక పోవడంతో పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్..
పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 2 లో చాలా మంది స్టార్స్ ను భాగం చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా స్పీడ్ గా షూట్ జరుపు కుంటున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ కానుంది అని ఇదే డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు టాక్.. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.