Rashmika Mandanna : 2021లో శ్రీవల్లిగా పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించిన శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న 2022లో సీతారామంలో కీలక ప్రాతలో కనిపించింది. అయితే ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా మృణాల్ ఠాకూర్కే వెళ్లిపోయింది. తర్వాత వచ్చిన యానిమల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక ఇమేజ్ ఈ మూవీతో మరింత పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో పుష్ప-2 ది రూల్ కోసం రష్మిక మందన్న ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో హిట్ కొడితే రష్మికను ఇక ఆపేవారు ఉండరు. తాజాగా ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో రష్మిక కీలక అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 అభిమానుల అంచనాలకు అందని రేంజ్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ మూవీలో పుష్పరాజ్ భార్యగా తన పాత్ర మరింత బాధ్యతగా ఉంటుందని తెలిపింది. ఈ మూవీలో ఎమోషనల్ డ్రామా ఎక్కువే ఉంటుందని, అయితే మసాలా కూడా ఎక్కువే అని ఫ్యాన్స్ ఊరిస్తోంది. దీన్ని బట్టి చూస్తూ సినిమాలో ఘాటు సీన్లు బాగానే ఉండేలా కనపడుతోంది. రష్మిక అందాలను ఫ్యాన్స్ మరింత ఆస్వాదించే అవకాశం ఉంది.