BJP Final List Release : తెలంగాణలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతున్నది. ఇక ఎన్నికల్లో మొదటి ఘట్టం ఈరోజు పూర్తవుతున్నది. ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానున్నది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు తుది జాబితాను విడుదల చేశాయి. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. దీంతో తుది జాబితా విడుదలైంది.
ఇక ఈ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ఇక అభ్యర్థులను అన్ని పార్టీలు ఖరారు చేశాయి. ఇక బీజేపీ కూడా తుది లిస్టును ప్రకటించింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నది. ఈసారి గెలిచి అధికారం కైవసం చేసుకోవాలని ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానం ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నది. దీంతో పాటు బీజేపీ కూడా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ అభ్యర్థే సీఎం అంటూ ప్రకటించి, రేసులోకి దూసుకొచ్చింది. ఇక ఎస్సీ వర్గీకరణ పై కూడా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తున్నది. ఈ క్రమంలో తన తుది జాబితాను విడుదల చేసింది.
- బెల్లంపల్లి : కొయ్యాల ఏమాజీ
- పెద్దపల్లి : దుగ్యాల ప్రదీప్
- సంగారెడ్డి : డీ రాజేశ్వర్ రావు
- మేడ్చల్ : ఏనుగు సుదర్శన్ రెడ్డి
- మల్కాజిగిరి : రామచంద్రారావు
- శేరిలింగంపల్లి : రవికుమార్ యాదవ్
- నాంపల్లి : రాహుల్ చంద్రా
- కంటోన్మెంట్ : గణేశ్ నారాయణ్
- దేవరకద్ర : కొండ ప్రశాంత్ రెడ్డి
- నర్సంపేట : పుల్లారవు
- వనపర్తి : అనుగ్నా రెడ్డి
- అలంపూర్ : మీరమ్మ
- చాంద్రాయణ గుట్ట: కే మహేందర్
- మధిర :పెరుమార పల్లి విజయరాజు