రైతుబంధుకు బ్రేక్ వేసిన సిఈసి..
తెలంగాణలో రైతుబంధుకు ఇచ్చిన అనుమ తులను ఉపసంహరిం చుకున్న ఎలక్షన్ కమిషన్.. రెండు రోజుల క్రితం రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చిన సిఈసి నేడు ఆ అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈనెల 28 లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది.ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఈసీ షరతు విధించింది. రైతు బంధు పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది.