Jr NTR Flexi : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య బహిరంగంగా.. అంతర్గతంగా వార్ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని తెలుగు తమ్ముళ్లు, నాయకులు, అభిమానులు ఘోషిస్తుంటే.. తమకు కిందికి ఏం నీరు వస్తుందోనని వైసీపీ నాయకులు వ్యతిరేక రాగం అందుకుంటున్నారు.
కేబినెట్ నిర్ణయంను తప్పు పట్టడం సరైంది కాదని చంద్రబాబు నిన్న కోర్టులో న్యాయమూర్తికి తన వాదనలను వినిపించారు. ‘స్కిల్ డెవలప్ మెంట్’ కుంభకోణం పూర్తిగా వైసీపీ కుట్రనేనని చెప్పుకచ్చారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత వేడేక్కాయి. బాబుకు మద్దతుగా తెలుగుదేశం, తెలుగు దేశం స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో జగ్గయ్య పేటలో ఒక బ్యానర్ వెలిసింది. ఇది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ‘థాంక్యూ జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చావు’ అంటూ వెలిసిన ఈ బ్యానర్ పై ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడును జైలుకు పంపించావు అంటూ మరణించిన హరికృష్ణ, నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జగన్ కు థాంక్స్ చెప్తున్నట్లు ఏర్పాటు చేసిన బ్యానర్ కలకలం రేపుతోంది. ఇది వైసీపీ పనేనని తెలగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.