350 Voters in One Family : అస్సాంలో తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంలో అత్యధిక ఓటర్లు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సోనిట్పూర్ (డి) పులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. ఆ కుటుంబ పెద్ద దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి ఐదుగురు భార్యలు ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు.
అలా కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిసి వారి జనాభా 1200కు చేరింది. అందులో 350 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. వారంతా అదే ఊరిలో 300 ఇళ్లలో నివాసం ఉంటున్నారు.