Jagtial News : ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. జగిత్యాల జిల్లా ఆత్మకూరులో ఈ సంఘటన జరి గింది. పెళ్ళికొడుకు బంధువులు వడ్డిస్తున్న వారిపై వంట సామాగ్రి, టేబుళ్ళ తో దాడి చేశారు.
ఆగ్రహంతో పెళ్లికూతురు బంధువులు ఎదురు దాడి చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. దీంతో పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. పోలీసులు 16 మంది పై కేసు నమోదు చేశారు.
ప్రశాంతంగా పెళ్లి తంతు పూర్తి చేసి వెళ్లాల్సిన కుటుంబ సభ్యులు మటన్ ముక్కలు వేయలేదని గొడవకు దిగడంతో ఆ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సాధారణంగా వివాహం అంటే సర్దుకు పోవడం ఉంటుంది. అయితే పెళ్లికొచ్చిన బంధువుల కారణంగా గొడవ కాస్త పెద్దగా అయింది.