After 20 years Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 47 ఏళ్ల వయసులో కూడా లేడీ ఫ్యాన్స్ ను కట్టి పడేస్తున్నారు. గత ఏడాది మహేష్ సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా నుండి కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న అదిరిపోయే గ్లింప్స్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేస్తున్న అదిరిపోయే పోస్టర్ తో మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.. అయితే ఈ పోస్టర్ వెనుక కథ వేరే ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ తో మహేష్ ఇప్పుడు మూడవ సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి..
ఇక ఈ సినిమాకు గుంటూరు కారం, అర్జునుడు, అతడే పార్థు, అమరావతికి అటూ ఇటు అనే టైటిల్స్ ముందుగా వినిపించాయి.. రేపు ఈ సినిమా నుండి అదిరిపోయే మాస్ స్ట్రైక్ రాబోతుంది అని దీనిని మీ సమీప థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాం అని నిన్న పోస్టర్ తో తెలిపారు.. ఈ పోస్టర్ ప్రకారం చుస్తే మహేష్ కబడ్డీ ఆటో కూతకు వెళ్తున్న ఆటగాడిలా కనిపిస్తున్నాడు..
అయితే ఇక్కడ మాత్రం మహేష్ రౌడీల పని చెప్పేందుకు కబడ్డీ కబడ్డీ అంటూ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ మెడకు తలకట్టు కట్టి మాస్ అండ్ క్లాస్ లుక్ లో అల్లడిస్తున్నాడు. మరి 20 ఏళ్ల ముందు మహేష్ ఒక్కడు సినిమా కోసం కబడ్డీ ప్లేయర్ గా కనిపించాడు.. ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఇలా కబడ్డీ ఆడుతున్నాడు అని తెలిసి ఈ సినిమాపై ఫ్యాన్స్ మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కడు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..