Anasuya Whole Night : వెండితెరపై అడుగు పెట్టాక అనసూయ భరద్వాజ్ ఫుల్ బిజీగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఒకే సారి రెండు, మూడు సినిమాల్లో నటిస్తుంది. ఉన్నవాటిని ముగించుకుంటూ.. కొత్త ప్రాజెక్టులను సైతం సైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ మధ్య ఆమె లీడ్ రోల్ పోషించిన రెండు సినిమాలు ‘రంగమార్తాండ’, ‘విమానం’ నెలల వ్యవధిలోనే రిలీజ్ కావడం విశేషం. వరుస ఆఫర్లతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. విమానంలో ఆమె బోల్డ్ క్యారెక్టర్ చేసింది.
ఈ రెండు చిత్రాల్లో అనసూయ రోల్ చాలా కీలకం. విమానం చిత్రంలో అయితే ఏకంగా వేశ్య పాత్రలో నటించింది. వెయ్యి రూపాయలకు శరీరాన్ని అమ్ముకునే స్లమ్ మహిళగా బోల్డ్ రోల్ లో నటించింది. ఎలాంటి పాత్రలకైనా అనసూయ చక్కగా ఇమిడిపోతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది ఆమెకు మంచి ప్లస్ అవుతుంది. విమానం సినిమామలో వేశ్య పాత్రలో ఆమె నటించిన తీరు
ఆమె ఒక ప్రాజెక్టు కోసం పని చేస్తుంది. అయితే రాత్రంతా ఈ షూటింగ్ కొనసాగించాడట దర్శకుడు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత షూటింగ్ ప్రారంభమైంది. ఇక తెల్లవారే వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని అనసూయ తన ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు. రాత్రంతా షూటింగ్ లో అలసిపోయానని నీరసంగా ఉన్న ఫొటో షేర్ చేసింది. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ చూసిన అభిమానులు.. డెడికేటెడ్ ఉన్న నటి అంటూ కామెట్లు పెడుతున్నారట.
అనసూయ చాలా మొండిఘటం. ఎంత కష్టం ఉన్నా ఎదుర్కొంటుంది. తన చదువు నుంచి కెరీర్ బిల్డ్ చేసుకోవడం ప్రేమ పెళ్లి వరకు అన్నీ సవాల్ గా తీసుకొంటూనే ఉంది. ఇక, అనసూయ చేతిలో ఉన్న అత్యంత భారీ ప్రాజెక్ట్ పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో డిసెంబర్ నాటికి విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు.