AP IPL : తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే న్యూస్. ఐపీఎల్ లో మరో తెలుగు టీం రాబోతున్నది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండగా, ఏపీ నుంచి మరో టీం రెడీ కాబోతుంది.
సంక్షేమం.. రాజకీయం గురించి మాత్రమే ఆలోచించే సీఎం జగన్ చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ నుంచి ఐపీఎల్ టీం ఉండాలని ఆయన భావిస్తున్నారట. అయితే ఇప్పటికే సిఎం జగన్ దీనిపై పలువురి తో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. హీరో రాం చరణ్ కొత్త ఐపీఎల్ టీం ఏర్పాటుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఏపీ టీంను వచ్చే ఐపీఎల్ టోర్నీకి దించాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. ఇదే సమయంలోనే క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం దీనికి ఊతమిచ్చింది.. అందులో భాగంగా ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టి సిద్దం చేయాలని సూచించారు. ప్రభుత్వం నేరుగా ఐపీఎల్ టీం కొనుగోలు చేసే అవకాశం లేదు. దీంతో..రాం చరణ్ పేరును తెరపైకి తెచ్చారు. ఇందుకు సహకరించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తనకు మిత్రులైన మరో రెండు యాజమన్యాల సహకారం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే మరోవైపు అంబటి రాయుడు సారథ్యంలో ఈ పనులు చకచకా సాగుతున్నాయి.
ఏపీ ఇమేజ్ పెంచేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లుగా సాగితే “వైజాగ్ వారియర్స్” పేరుతో ఐపీఎల్ టీం రెడీ కానుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు ఇది పండుగే.
ReplyForward
|