Anushka Shetty :
ప్యాన్ ఇండియా స్టార్.. యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ అని ప్రభాస్ ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఫుల్ బీజీగా ఉన్నాడు. ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో త్వరలోనే ‘సలార్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అదేవిధంగా వైజయంతి బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ తో ఓ మూవీ చేస్తోంది. ప్రాజెక్ట్ కే పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తోంది. ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ విషయం పక్కన పెడితే.. టాలీవుడ్లో ప్రభాస్-అనుష్క జోడికి ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మిర్చి’.. ‘బాహుబలి’.. ‘బాహుబలి-2’ సినిమాలకు ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రభాస్ పెళ్లి విషయం వచ్చిన ప్రతీసారి అనుష్క శెట్టి పేరు తెరపైకి వస్తోంది. ప్రభాస్ కు ఈడు జోడు విషయంలో అనుష్క ఫర్ఫాక్ట్ గా సరిపోతుందని.. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
అయితే వీరిద్దరు మాత్రం తాము మంచి స్నేహితుల మంటూ పెళ్లి మ్యాటర్ ను సైడ్ చేస్తూ వస్తున్నారు. కాగా అనుష్క శెట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో వస్తోంది. ఈ మూవీలో అనుష్క శెట్టి చెఫ్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఫేవరెట్ రెసిపీ ఛాలెంజ్ ను ను విసిరింది.
తన ఇన్ స్టాలో మంగళూరు చికెన్ కర్రీ.. నీర్ దోశ వంటకాలు ఎలా చేయాలో అనుష్క వివరించింది. “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చాలా సరదాగా ఉంటుంది.. ఈరోజు నేను నా ఫేవరెట్ వంటకం గురించి షేర్ చేస్తున్నాను.. అంతేకాదు దీన్ని స్టార్ట్ చేస్తున్నాను.. ఈ ఛాలెంజ్ ను ప్రభాస్ కు విసురుతున్నాను..’ అంటూ పోస్ట్ చేస్తూ హీరో ప్రభాస్ కు దీనిని కొనసాగించాలని ట్యాగ్ చేసింది.
అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్ తన ఫేవరెట్ డిష్ ‘రొయ్యల పలువా’ అని చెప్పాడు. దీని తయారికి సంబంధించిన రెసిపీని పోస్ట్ చేసి గ్లోబల్ స్టార్ రాంచరణ్ కు చాలెంజ్ విసిరాడు. దీంతో ఇప్పుడు రాంచరణ్ తన ఫేవరేట్ వంటకం రెసిపీ చేయాల్సి ఉంటుంది. మరీ దీనిని రాంచరణ్ ఎంత వరకు ముందుకు తీసుకెళుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.