26.9 C
India
Friday, January 23, 2026
More

    Pakistan Request : కనీసం ‘ఇండియా వర్సెస్ పాక్’ వేదికను మార్చండి..!

    Date:

    Pakistan request
    Pakistan request

    Pakistan request : ముందు చూస్తే నువ్వు వెనుక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరిస్థితి. ఆసియా కప్ 2023 పాకిస్తాన్ లో జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ క్రికెట్ టీం రాదని బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత్ రాకుంటే తాము రామంటూ శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా చెప్తున్నాయి. దీంతో ఆసియా కప్ నిర్వహణ దేశాన్ని మార్చాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. అయితే ఆసియా కప్ కు భారత్ రాకుంటే భారత్ లో నిర్వహించే వరల్డ్ కప్ కు తాము కూడా రామని పాకిస్తాన్ బెదిరిస్తోంది.

    పీసీబీ బెదిరింపులకు తాము తలొగ్గే పరిస్థితి లేదని బీసీసీఐ తేల్చి చెప్తుంది. అయితే ఇప్పటి వరకూ పాకిస్తాన్ వరల్డ్ కప్ లో ఆడుతుందా? అనే దానిపై పీసీబీ క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా కప్ కు భారత్ రాకుంటే.. వరల్డ్ కప్ కు తాముకూడా రామని పాక్ క్రికెట్ బోర్డు చెప్తుంది. పాక్ ఎంత బెదిరించినా తాము బెదరమని బీసీసీఐ చెప్తుంది. పాక్ లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బీసీసీఐ ఆసియా కప్ వేదిక మార్చాలని కోరుతుంది.

    అయితే ఇందులో పాకిస్తాన్ కు మరో తలనొప్పి కూడా ఉంది. వరల్డ్ కప్ ఆడకుంటే నష్ట పరిహారంగా రూ. 200 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఐసీసీ ఇప్పటికే పాకిస్తాన్ ను హెచ్చరించింది. దీంతో పాక్ తేసేది లేక వరల్డ్ కప్ కు రావాల్సి ఉంటుంది. ఇక ‘ఇండియా వర్సెస్ పాక్’ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని ఇప్పటికీ లీకులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కనీసం ఈ మ్యాచ్ ను చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా లాంటి నగరాలలో పెట్టాలని పీసీబీ కోరుతుంది.

    అహ్మదాబాద్ వేదికగా తమకు భద్రతా కారణమైన ఇబ్బందులు ఉంటాయని అందుకే ఈ మ్యాచ్ వేదికను మార్చాలని పీసీబీ కోరుతోంది. అహ్మదాబాద్ ఉన్నరాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనేది అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం క్రికెట్ బోర్డును హెచ్చరిస్తూనే ఉంది. అయితే తాను జైషాతో మాట్లాడానని, ఆసియాకప్ కోసం ఇండియా పాకిస్తాన్ రావడంలో అభ్యంతరం ఏంటో తెలపాలని కోరినట్లు పీసీబీ చైర్మన్ నజం సేథీ ప్రశ్నించారు. దీనికి జైషా ఏమాత్రం స్పందించలేదని సేథీ చెప్పారు. పాకిస్తాన్ లో కాకుండా ఇంగ్లాండ్ లేదంటే యూఏఈలో ఆసియా కప్ – 2023 నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. ఈ కప్ పై క్లారిటీ వస్తేనే, వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల కానుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    Pakistan : పాకిస్తాన్ కు మరో షాక్

    Pakistan : పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏషియా క్రికెట్ కౌన్సిల్(ACC)కు...

    Pakistan : పాకిస్థాన్ అణుదాడికి సిద్ధమవుతోందా? ఏం జరుగుతోంది?

    Pakistan :  తాను నష్టపోయినా పర్వాలేదు..భారత్ మాత్రం బాగుపడకూడదు అని పాకిస్థాన్...

    Pakistan : బిగ్ న్యూస్.. భారత్ లో 15 చోట్ల దాడికి పాక్ యత్నం!

    Pakistan: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రతీకార చర్యకు సిద్ధమవుతుందనే సంకేతాలు వచ్చిన...