Ayyappa Swamy Prana Prathishta 4th Day : సాయి దత్త పీఠం ఆధ్వర్యంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొనసాగుతున్న ‘ప్రాణ ప్రతిష్ట’ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆలయంతో పరిసరాలు మొత్తం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి సాయి దత్త పీఠంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొలువు దీరబోతున్నారు.
అయ్యప్ప స్వామి వారితో పాటు శ్రీ ఆది శంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాల భైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈ వేడుకల వైభవంగా నిర్వహించేందుకు అందంగా ముస్తాబు చేశారు. మార్చి 17 (ఆదివారం) నుంచి మార్చి 20 (బుధవారం) వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
మార్చి 19 (మంగళవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష శాంతి, గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల పూజ, వేదికార్చన, కాలయాగ పూజ, వేద పఠనం, విశేష కాల భైరవ, అయ్యప్ప, ఆది శంకరాచార్య రామానుజ ఆచార్య మూల మంత్ర ద్రవ్యతృతి, దాస దర్శనం (పాలు, వెన్నె, నెయ్యి, బంగారం, వెండి, కన్య, సువాసిని, యజమానన్, దంపతి, ఆచార్యన్), పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరనం నిర్వహించారు.
ఇక సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విశేష సంధి, గణపతి పూజ, పుణ్యహవచనం, నూతన విగ్రహ నయనాదివాసం, నూతన విగ్రహ శయనాదివాసం, మూడో కాల యాగశాల పూజ, వైదికార్చన, విశేష మంత్ర పూజా, హోమం, వేద పఠనం, హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు.
మార్చి 20వ (బుధవారం) వేడుకలకు చివరి రోజు గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల పూజ, విశేష మంత్ర జప హోమం, నూతన బింబ ప్రతిష్ట, యంత్ర స్తపనం, అష్ట బంధన సమర్పణం, బింబాసుది రాక్షసబంధనం, తట్వార్చన, స్పర్షహుతి, పూర్ణాహుతి, యంత్రదానం, నూతన విగ్రహ అష్టబంధన మహా కుంభాబిషేకం, అలంకారం, హారతి, తీర్థ ప్రసాద వితరణం నిర్వహించారు.
శాస్త్రోక్తంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. చివరిరోజు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వారి కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv)
More Images : Ayyappa Swamy Prana Prathishta 4th Day photos