Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని నియమించడాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని మెజార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈటెల వర్గం నేతలు మాత్రం కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ర్ట బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞులు, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నామని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. బండి సంజయ్ కొంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రాధన్యత సంతరించుకుంది.
అయితే ప్రస్తుతం తెలంగాణ కమలం పార్టీలో అనిశ్చితి నెలకొంది. బండి సంజయ్ అనుచరులంతా కొంత అసహనంతో ఉన్నారు. అయితే బండికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కబోతుందనే ప్రచారం నేపథ్యంలో కొంత సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. మరి అధిష్టానం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తుందని అంతా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడి మార్పు రానున్న ఎన్నికల్లో పార్టీ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే కిషన్ రెడ్డి కొంత క్లాస్ నాయకుడని, బండి సంజయ్ లా మాస్ జనాన్ని ఆకట్టుకోలేరని వారు అభిప్రాయపడుతున్నారు.
ReplyForward
|