Andukuru News : తెలుగుదేశం పార్టీ విధానాలతో ఆకర్షితులైన పెద్దకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సమక్షంలో వైసీపీ నుంచి 20 కుటుంబాలు టిడిపిలో చేరారు. క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలో గత కొన్నేళ్లుగా 20కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వచ్చారు.
అయితే గడచిన ఐదు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని భావించిన వారు ఇక వైసీ పీలో కొనసాగలేమని టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ప్రకటించిన వెంటనే 20 కుటుంబాల సభ్యులు ఆయనకు మద్దతు తెలుపుతూ మీతోపాటే టిడిపిలో కొనసాగుతామని పార్టీ విజయానికి మా వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.
ఈరోజు 20 కుటుంబాలే కాక మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్న మా కుటుంబ సభ్యులను కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీలో తెప్పించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సంక్షేమ కార్యక్రమాలు అం దగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిపై ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని ప్రవీణ్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు విజన్ ఏంటో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు.. ప్రజలకు అందరికీ తెలుసని.. మరోసారి రాష్ట్రాన్ని వైసీపీ చేతిలో పెట్టడం ప్రజలకు ఇష్టం లేదని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు టిడిపికి ఆదరణ లభిస్తుందని తప్ప కుండా తెలుగుదేశం పార్టీ కూటమి 2024 ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తుందని భాష్యం ప్రవీణ్ భీమా వ్యక్తం చేశారు.