మరి ఈసారి 5వ వారంలో నామినేషన్స్ లో అమర్, శోభా, తేజ, శివాజీ, యావర్, ప్రియాంక, గౌతమ్, శుభ శ్రీ ఉన్నారు. వీరికి ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఓటింగ్ లో ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతానికి అయితే శివాజీ టాప్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పవర్ అస్త్రాను కోల్పోవడంతో ఈయనకు బయట సానుభూతి పెరిగినట్టే అనిపిస్తుంది. ఈయన తప్ప మిగిలిన వారి ఓటింగ్ అటు ఇటుగా ఉంది.
ఓటింగ్ లో 48 శాతం శివాజీకే వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈయన టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రెండవ స్థానంలో యావర్ ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి తర్వాత స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.. మూడవ స్థానంలో అమర్ దీప్, 4వ స్థానంలో ప్రియాంక జైన్, ఐదవ స్థానంలో శుభ శ్రీ ఉన్నట్టు తాజా టాక్..
ఇక చివరి స్థానాల్లో గౌతమ్, తేజ ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో తేజ ఉన్నప్పటికీ ఓటింగ్ ముగిసే సమయానికి ఈ ఓట్లు ఎవరికీ ఎక్కువ పడతాయో ఎవరు ఏ స్థానాల్లోకి వస్తారో చూడాలి.. టాప్ లో అయితే శివాజీ మాత్రమే కొనసాగుతారు.. ఆ తర్వాత స్థానాల్లో మార్పులు రావొచ్చు.. ఓటింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టమే..