BJP వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో పలు మార్పులు చేర్పులు చేస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ప్రధాన కార్యదర్శులను తొలగించారు. ముస్లిం వర్గానికి చెందిన ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ తారీక్ మనసూర్ ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన ఎంపీ బండి సంజయ్ కి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు చత్తీస్గఢ్ కి చెందిన గిరిజన నాయకురాలు లతా హుస్సేన్ కి ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లతా నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాధ మోహన్ సింగ్ ను పార్టీ ఉపాధ్యక్షుడి నుంచి తొలగించారు.
అదేవిధంగా పార్టీలో మొత్తం తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, కర్ణాటకకు చెందిన సిటీ రవి, అసోం కు చెందిన పార్లమెంట్ సభ్యుడు దిలీప్ సైక్లియాను ను పక్కన పెట్టారు. కార్యదర్శి ద్వివేది లతోపాటు ఏపీ వ్యవహారాలను చూసే సునీల్ దేవధర్ ను కూడా పక్కన పెట్టారు. రాధా మోహన్ అగర్వాల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక కీలకమైన పార్టీ ఉపాధ్యక్షుడు తో పాటు యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్పేయి తీసుకున్నారు. మనసూర్ నియామకంతో పార్టీలో ముస్లిం వర్గానికి చెందిన ఉపాధ్యక్షుల సంఖ్య రెండు కు చేరింది. ఇప్పటికే కేరళకు చెందిన అబ్దుల్లా కొట్టి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నారు.
జాతీయ కార్యదర్శిగా కేరళ చెందిన కేకే ఆంటోనీ కుమారుడు అనిల్ అంటోని ,యూపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సురేంద్ర సింగ్, అసోంకు చెందిన రాజ్యసభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్ ఉన్నారు. వీరిలో సురేందర్ సింగ్ యూపీలో బలమైన సామాజిక వర్గం గుజ్జరకు చెందిన నాయకుడు. కేరళ ఎన్నికల నేపథ్యంలో అనిల్ అంటోని నియామకానికి కూడా ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను జాతీయ క్యాడర్ కు తీసుకోవడం ద్వారా రాష్ట్రాల పై పట్టు సాధించాలని భావిస్తున్నది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి మరింత ఊపు తెచ్చేందుకు కీలక నేతలను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. పార్టీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, నడ్డా తదితరులంతా దీనిపై పూర్తిస్థాయిలో చర్చి జరిపిన అనంతరం కమిటీ సభ్యుల నియామకం జరిగింది. ఏదేమైనా మరోసారి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే జాతీయ కార్యవర్గ కూర్పు జరిగినట్లుగా శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ReplyForward
|