AP BJP : ఎన్నికలవేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిడిపి జనసేన తో కలిసి ఎన్డీఏ కూటమితో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తోం ది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీలోనే మఖాం వేశారు. పొత్తులో బిజెపికి ఆరు ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. కొన్ని మార్పులు కోరుతున్న బిజెపి నాయకత్వం తుది జాబితా ప్రకటన చేయనుంది. అటు బిజెపి నాయకత్వం ఏపీలో ఎన్నికల బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
బిజెపి తాజా అడుగులు..
400 సీట్ల టార్గెట్ గా బిజెపి అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ సొంతంగా సీట్లు గెలవాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగా టిడిపి జనసేనతో 2014 తరహా లో పొత్తు పెట్టుకుంది తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. బిజెపికి కేటాయించిన సీట్లలో మార్పులు,పోటీ చేసే వారి పేర్ల పైన బిజెపి నాయకత్వంతో పార్టీ రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి ఢిల్లీలోని మకాం వేశారు. అక్కడ చర్చలు కొనసాగుతున్నాయి ఈ సమయంలోనే బిజెపి కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ ఎన్నికల ఇన్చార్జిలోగా ఇద్దరు నేతల ను నియమించింది.
ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ గా అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్ లను నియ మించిన పార్టీ నాయకత్వం వారిని ఏపీలోనే మకాం వేయాలని ఆదేశించింది. అభ్యర్థుల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల హామీలు కూటమి సమన్వయం పార్టీ నేతలకు దిశా నిర్దేశం వంటివి చేసే బాధ్యతలను ఈ ఇద్దరు నేతలకు అప్పగించింది. దీంతో ఇక కూటమి వ్యవహారాలను బిజెపి అధినాయకత్వం ఇక్కడి పార్టీల మధ్య ఈ ఇద్దరు నేతలు సమన్వయం చేయనున్నారు.