After the World Cup 2023 : ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో టీమిండియా దూసుకెళ్తున్నది. ఐదు వరుస విజయాలతో టాప్ వన్ లో ఉంది. ఇఖ నవంబర్ 19న గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఈ వరల్డ్ కప్ ముగియనుంది.
అయితే వరల్డ్ కప్ ముగియగానే నవంబర్ 23 నుంచి టీమిండియా ఆస్ర్టేలియా మరో సిరీస్ కు సిద్ధమవుతున్నది. టీ 20 సిరీస్ కోసం జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తున్నది. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు మరికొందరు ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ తో కోచ్ గా ఒప్పందం ముగియనుంది. ఇక వీవీఎస్ లక్ష్మణ్ ఆ బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తున్నది. లేదంటే ద్రావిడ్ కే మరో చాన్స్ ఇవ్వదలుచుకుంటే ఆయన మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఐపీఎల్ లోని ఏదైనా జట్టుకు ఆయన కోచ్ గా వెళ్లనున్నారు.
ఇక ఈ టీ 20 సిరీస్ కోసం కెప్టెన్ ను కూడా మార్చనున్నారు. టీ 20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు విశ్రాంతి తప్పనిసరి. ఆయన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కవచ్చు. ఇక 202లో టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. ఈనేపథ్యంలో సూర్య తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు సీనియర్లు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి కల్పించి, కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. ఆస్ర్టేలియాతో సిరీస్ లో తిలక్ వర్మ, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, రింకూ సింగ్లకు చోటు దక్కే చాన్స్ ఉంది. ఇప్పటికే ఈ ఆటగాళ్ల ప్రదర్శనపై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచింది.