Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకి స్వల్ప జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ముందస్తుగా.. సీఎంకే కరోనా ఆర్టీపిసిఆర్ టెస్ట్ చేశారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జేఎన్2 అనే న్యూవేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా అనారోగ్యం బారినపడడం ప్రజలను, కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
రేవంత్ రెడ్డికి సడెన్ గా జలుబు, దగ్గు, జ్వరం రావడంతో కోవిడ్ టెస్టులు చేస్తున్నట్టు సమాచారం. సీఎంకు కరోనా నిర్ధారణ అయితే ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకోనున్నారు.