Congress second list : కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ ఇక రెండో జాబితాను సిద్ధం చేయాలని చూస్తోంది. ఈ మేరకు ముమ్మరంగా అభ్యర్థులను వడబోస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం ఎవరి మాటలు వినడం లేదు. సొంత సర్వేలు నిర్వహించి అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పక్కా విజయం సాధించే వారికే టికెట్లు కేటాయిస్తున్నారు.
ఖమ్మం విషయంలో కాస్త పట్టు బిగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక్కడ నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తాము కోరుకున్న నియోజకవర్గాలపై వారు పట్టు సడలించడం లేదు. తాము కోరుకున్న స్థానాలు తమకు కావాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తం 64 నియోజకవర్గాలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పూర్తి స్థాయి ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. టికెట్ల కేటాయింపు పూర్తయితే ప్రచార హోరు పెంచేందుకు రెడీగా ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం సమావేశాలు నిర్వహిస్తోంది. రెండ జాబితాపై తుది నిర్ణయం తీసుకునేందుకు తర్జనభర్జన పడుతోంది. అంతటా వివాదాలు లేకపోయినా ఖమ్మంలో సీట్ల సర్దుబాటు కుదరడం లేదు. అందుకే జాబితా ఆలస్యం అవుతోంది. రెండో జాబితా ప్రకటిస్తే ఇక అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకుని విజయం సాధించేందుకు అన్ని అస్త్రాలు రెడీ చేసుకుంటోంది.