Telangana Electricity : ‘‘తెలంగాణ వస్తే కరెంట్ కోసం నానా కష్టాలు పడతారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునే రోజులు వస్తాయి..’’ అని కొందరు సీమాంధ్ర పాలకులు అనేవారు. అయితే అవన్నీ తప్పు అని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిరూపించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇండ్లకు, వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇచ్చి దేశాన్నే ఆశ్చర్యపరిచారు. దేశంలోనే 24గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంది. అయితే అప్పులు చేసి కరెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రైతుల కోసం అప్పులు చేసినా ఫర్వాలేదు.. రైతులకు కరెంట్ ఇవ్వడాన్ని మించింది ఏదీ లేదు.. అని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చేవారు.
ఆ విషయం పక్కనపెడితే.. వ్యవసాయానికి తాము కూడా 24గంటల కరెంట్ ఇస్తామని.. ఇంకా మిగతా పలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేటికీ వారం రోజులు గడిచాయి. అయితే కరెంట్ సమస్యలపై ఇప్పటికే పలువురి వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఒక తాత కరెంట్ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేయడం అందరినీ కలిచివేస్తోంది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ మహిళ.. ఓ తాతను 24గంటల కరెంట్ వస్తుందా? అని ప్రశ్నించింది.
దానికి తాత…‘‘ నారుమడి వేద్దామని అనుకుంటున్నా.. ఇప్పటికీ 8 రోజులైంది కరెంట్ రాక..ఇప్పటికే అదును తప్పేటట్టు ఉన్నది. కరెంట్ ఎప్పుడూ వస్తదో ఏమో.. అప్పుడే బాగుండే.. కేసీఆర్ ఎట్ల చేసైనా 24గంటల కరెంట్ ఇచ్చిండు.. ఆయన కంటే ముందు కరెంట్ ఎప్పుడొస్తదో తెలియక బాయిల కాడ్నే పడుకునేటోళ్లం.. మళ్లా ఆ రోజులు వచ్చేట్టు ఉన్నయ్.. ఇంకా రైతు బంధు అన్నరు అవి పడలే. రుణమాఫీ చేస్తలేరు.. పింఛన్ నాలుగు వేలు అన్నరు.. అన్నీ ఇస్తామన్నరు.. ఏది చేస్తలేరు..’’ అని వాపోయాడు.