Raghubabu Buy Acres In Amaravati : కమెడియన్ పృథ్వీ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది.. ఈయన అంతలా ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఈయన పోషించిన రోల్స్ అన్ని ఆడియెన్స్ ను బాగా అలరించాయి.. మరి ఈయన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.
2019 ఎన్నికల నుండి పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు.. ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు.. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబిసి ఛైర్మెన్ పదవి ఇచ్చారు. అయితే లైంగిక పరమైన వివాదంలో పృథ్వీ పేరు రావడంతో అతడి పదివిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఈయన జనసేన పార్టీకి మద్దతు దారుడిగా మారిపోయారు.. కమెడియన్ పృథ్వీ ఏ వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి.. అందుకే ఈయన ఎప్పుడు నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా పృథ్వీ అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసారు..
రాజధాని భూముల విషయంలో పృథ్వీ ఒక ఉదాహరణగా చెబుతూ ఒక విషయాన్నీ బయట పెట్టారు.. అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ చాలా మంది వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీలు కోట్ల రూపాయలతో భూములు కొన్నారు.. అందులో ప్రముఖ నటుడు రఘుబాబు కూడా ఉన్నారట..
రఘుబాబు కూడా కమెడియన్ గా తెలుగులో రాణిస్తున్నాడు.. ఆయన అమరావతిలో అందరిలాగానే ఆశపడి 15 ఎకరాలు కొన్నారట.. అమరావతి కూడా మరోకోకా పేట అవుతుంది అని భూముల వాల్యూ ఎక్కడికో వెళుతుంది అని ఆయన అన్నారట.. ఇప్పుడు ఏమైంది వాల్యూ మొత్తం పడిపోయింది..
వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం లోకి వస్తే అమరావతినే రాజధానిగా ఉంటుందని కానీ ఇప్పుడు మాత్రం అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది ఏపీ పరిస్థితి చుస్తే బాధేస్తుంది అంటూ అమరావతి రైతులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో అడుక్కుంటున్నారు అన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.