NV Ramana : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు గుర్తింపు తగ్గడం లేదని మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రా మికరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయిందని ఎన్.వి. రమణ అన్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతు సమస్యలపై వ్యాఖ్యానించారు. రైతులు రైతు కూలీలకు న్యాయం జరగాలంటే వారికి అన్ని శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేదంటే సంపన్నుల అధిపత్యంలోనే వ్యవస్థలు ఉండిపోయి కర్షకులకు న్యాయం జరగదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. రైతుల కష్టాలు తీరాలి అంటే తప్పకుండా వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలా అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది ఆయన అన్నారు.