Sekhar Kammula టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, కొన్ని నెలల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ అయింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ యాడ్ చేయగా, ఆ రోల్ లో అక్కినేని నాగార్జున నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో నాగార్జునను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకోనున్నట్లు చిత్రబృందం భావిస్తోంది. గతంలో కార్తీతో కలిసి నాగార్జున ‘ఊపిరి’లో నటించారు. ఇదులో ఆయన నటన బాగా హైలెట్ అయ్యింది. మరో తమిళ హీరో ధనుశ్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో నాగ్ ఓ క్యామియో రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘సర్’ చిత్రంతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు ధనుశ్. అయితే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు స్ట్రెయిట్ మూవీతో టాలీవుడ్ అభిమానులకు కనిపించబోతున్నారు. టాలెంటెడ్ నటి రష్మిక మందన్న ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండడంతో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
నాగార్జున సతీమణి అమల అక్కినేని ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నటించింది. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య కూడా శేఖర్ దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’లో నటించాడు. ఇప్పుడు నాగ్ వంతు వచ్చింది. ఆయన ఈ సినిమాతో శేఖర్ కమ్ములతో డైరెక్షన్ లో నటించనున్నారు.