Virat Kohli :
23 అక్టోబర్, 2022.. ఈ తేదీని ఎవరూ మర్చిపోరు. ఆ రోజు విరాట్ కొహ్లీ విశ్వరూపం చూపించిన రోజు. దాయాది దేశం పాకిస్తాన్ పై చెలరేగి టీమిండియాను ఒంటి చేతితో గెలిపించాడు.
టీ 20 వరల్డ్ కప్-2022లో భాగంగా జరిగిన సూపర్-8 మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ తడబడింది. 31 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కొహ్లీ జట్టును గట్టెక్కించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టును విజయం వైపు పరుగులు పెట్టించాడు. ఇందులో భారత్ చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాలి. 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన హరీస్ రవూఫ్.. తొలి నాలుగు బంతులకు కేవలం 3 పరుగులే ఇచ్చాడు.
ఇక్కడ నుంచి ఆటను కొహ్లీ టర్న్ చేశాడు. ఆ ఓవర్ చివరి 2 బంతులను 2 సిక్సర్లు కొట్టిన కొహ్లీ విజయాన్ని మరింత చేరువ చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో రెచ్చిపోయి ఆడి జట్టును గెలిపించాడు.
ఆ మ్యాచ్ లో హరీస్ రవూఫ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 22 బంతులకు కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తన స్పెల్ లోని చివరి 2 బంతులకు రెండు సిక్సర్లు బాది పాకిస్తాన్ పాలిట విలన్ లా మారాడు.
రవూఫ్ పగ తీర్చుకునేందుకు పట్టుదలగా ఉన్నాడు. టీ-20 ప్రపంచకప్ లో కొహ్లీ చేతిలో ఎదురైన పరాభవానికి ఆసియా కప్ లో పగ తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని క్రీడాకారులు భావిస్తున్నారు.