AP Volunteers : వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నగదు పంపిణీ చేసే పథకాలకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజుల నుంచి వాలంటీర్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫోకస్ పెట్టింది.
సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు కీలకంగా మా రుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీ నేతలకు అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తు న్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు.
దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై ప్రత్యేక దృష్టిని సారించింది. తాజాగా వాలెంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే వాలంటీర్ల స్థానంలో ఎవరి ద్వారా ఈ నగదు పంపిణీ చేస్తారన్న అంశంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వలేదు.