
Uday Kiran death : డైరెక్టర్ తేజ అంటే తెలియని తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి.. ఒకప్పుడు తేజ ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీలను తెరకెక్కించాడు.. ఇప్పటికీ తేజ తెరకెక్కించిన సినిమాలు ఇంకా ఫ్రెష్ గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. అయితే ఆ తర్వాత వరుసగా ప్లాప్స్ రావడంతో తేజ లాంగ్ గ్యాప్ తీసుకుని నేనే రాజు నేనే మంత్రి సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమాతో మళ్ళీ హిట్ బాటలోకి వచ్చేసాడు.. ఇదిలా ఉండగా తేజ తాజాగా రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తో అహింస సినిమాను చేస్తున్నాడు.. నిర్మాత డి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కథానాయకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా తేజ ఒక ఇంటర్వ్యూలో హీరో ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఈయన డెత్ మిస్టరీ ఎవ్వరు కూడా తెలియదని నటిస్తున్నారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. విలేఖరి ఈయనను ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి చెప్పమని అడుగగా.. ”దాని గురించి నేను చెబుతాను.. కానీ ‘మీరే చెప్పండి’ అని అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు”.. అని చెప్పుకొచ్చారు.. మరి ఈయనకు తెలిసిన నిజాలు ఎప్పుడు బయట పెడతాడో వేచి చూడాలి..
ఇక అహింస సినిమా జూన్ 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.. ఇప్పటికే అహింస నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సదా, గీతికా, రజత్ బేడీ, కల్పలత వంటి వారు కీలక పాత్రలను పోషిస్తుండగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ నిర్మిస్తున్నారు..