Rajinikanth Governor : రాజకీయాల్లోకి వస్తానంటూ పార్టీకి ఏర్పాట్లు కూడా చేసుకున్న రజినీకాంత్ కు ఒక్కసారిగా కిడ్నీలు ఫెయిల్ కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పార్టీని ప్రకటించకుండా అభిమానులను షాక్ కు గురిచేశారు. తనకు ఆరోగ్యం సహకరించని దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని కాడి వదిలేశారు.
నిజానికి రజినీకాంత్ ను బీజేపీ బాధ్యతలు తీసుకోవాలని స్వయంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఆహ్వానించారు. రజినీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అయినా కూడా రజనీ కాంత్ మనసు మారలేదు. అనారోగ్యం కారణంగానే ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
రజినీకాంత్ కు కేంద్రం త్వరలో గవర్నర్ పదవిని ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఆయన సోదరుడు సత్యనారాయణ స్పందిస్తూ.. ‘పదవిపై ఆశలు పెట్టుకోలేదు. ఒకవేళ వస్తే సంతోషిస్తాం. దాన్ని రజినీ తప్పకుండా స్వీకరిస్తారు. అంతా దేవుడి చేతుల్లో ఉంది’ అని తెలిపారు.
కాగా, ఇటీవల యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో రజినీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.