Hero Allu Arjun : టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా మంది ఇష్టపడతారు.. ఈయన నటన ముఖ్యంగా స్టైల్ అంటే అందరికి చాలా ఇష్టం.. ఇక పుష్ప సినిమాతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అల్లు అర్జున్ తాజాగా ఆహా ఓటిటీలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకు హాజరయ్యాడు..
ఈ షో సీజన్ 2 ఫైనల్ కు చేరుకుంది.. దీంతో విజేతలకు అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఫైనల్ ఎపిసోడ్ కు అతిథిగా విచ్చేసారు.. ఈ షోలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఐకాన్ స్టార్ మాట్లాడుతూ.. తనకు దేవుడు ఎలా ఉంటారో తెలియదు కానీ నాకు తెలిసిన దేవుడు మాత్రం తన తండ్రి అని ఆయనే నాకు అన్నీ ఇచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈయన తన తండ్రి మీద చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ షో జూన్ 3,4 తేదీలలో ప్రసారం కానుంది.. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరు.. దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాదు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా షూట్ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు పార్ట్ 1 కంటే మరింత బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.