Chiru Balaiah : తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య కొనసాగుతున్నారు. తమదైన చిత్రాలతో దూసుకుపోతున్నారు. వారిద్దరు కలిసి నటించాలని ప్రేక్షకులు కలలు కన్నా అది సాధ్యం కాలేదు. గతంలో రాఘవేంద్ర రావు ప్లాన్ చేసినా ఎందుకో ఆ ప్రాజెక్టు కుదరలేదు. అపూర్వ సహోదరులు సినిమాలో ఇద్దరు కలిసి నటించాల్సి ఉండగా చివరి క్షణంలో చిరంజీవి తప్పుకోవడంతో బాలయ్య రెండు పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
కానీ ఆ ప్రాజెక్టు మిస్ అయినా ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద కనిపించే చాన్స్ దక్కింది. బాలయ్య హోస్ట్ గా వస్తున్న ఆహాలో ఆ కల నెరవేరనుంది. ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకు రావడం ప్రేక్షకులకు పండగే. దీంతో వారిద్దరు కలుసుకుంటే ఎలాగుంటుందనే దానిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సుకత నెలకొంది.
దీని కోసం అల్లు అరవింద్ ప్లాన్ చేశారట. ఆహా ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఈ మేరకు దసరాకో లేక జనవరికో ఈ సరదా తీరే అవకాశం కనిపిస్తోంది. చిరంజీవి, బాలయ్య నెంబర్ వన్ , టూ గా కొనసాగుతున్నారు. తెలుగు పరిశ్రమలో తమకు ఎదురే లేదంటూ ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు.
ఆహా ద్వారా బాలయ్య కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన బావతో సందడి చేసిన బాలయ్య సీజన్ కు ఒకరిని తీసుకొస్తున్నారు. ఇక మూడో సీజన్ కు చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయిక కోసమే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారి కోరిక త్వరలో తీరనుందని తెలుస్తోంది. దీనికి ఆహా వేదిక కానుందని చెబుతున్నారు.