పురాణ నేపథ్యం:
మహావిష్ణువు ఏడవ అవతారం అయిన శ్రీరామచంద్రుడికి సంబంధించిన చారిత్రక ప్రాంతం సరయూ నది తీరంలో ఉన్న అయోధ్య. సూర్యవంశరాజు అయిన ఆయుధ్ కాలంలో నిర్మితమైనట్లు ఆ తర్వాత ఈ అయోధ్యా నగరం నుంచి రాముడు పరిపాలించినట్లు పురాణంలో ఆధారాలు.
చారిత్రక నేపథ్యం:
మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు ప్రాంతం తమదే అంటూ తమదే అని హిందూ ముస్లింలు దశాబ్దాలుగా (1885 ?) కలహించుకున్నాయి.
మత వివాదం:
1986లో రామజన్మభూమికి తాళాలు వేయటంతో వివాదం.
రాముడు సీతాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించాలని పూజలు చేసే అవకాశం ఇవ్వాలని హిందువులు..అది తమ ఆస్తి అని ముస్లిములు ఒక్కో సంవత్సరం ఒక్కో కేసులు వేస్తూ వస్తున్నారు
న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ::
రామమందిర నిర్మాణమే ప్రధాన అజెండాగా 25/9/1990 భాజపా కీలక నేత అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఆయన నిర్వహించిన రథయాత్ర (25/12/1990 – 06/12/1992) ఒక సంచలనం.. ఆ తర్వాత 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదుని కూల్చేసిన కరసేవకులు. 2003 లో బాబ్రీ మసీదు కింద శ్రీరాముని ఆలయం ఉంది అన్నట్లు చారిత్రక ఆధారాలతో భారత పురాతత్వ శాఖ బయటపెట్టింది.
2010లో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి రెండు భాగాలను హిందువులకు ఒక భాగాన్ని ముస్లింలకు అంటూ అలహాబాద్ కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. 2011లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. ఆ తర్వాత వివిధ దశల్లో కేసుల విచారణ జరిగి జస్టిస్ రంజన్ గోగోయ్ తో కూడిన ధర్మాసనం సుప్రీంలో నవంబరు 9 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.. రామమందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పు అంశంలో మోదీ ప్రభావితం చేశారు అనే ఒక బహిరంగ విమర్శ & అంతర్గత ప్రశంస. తీర్పు తర్వాత ఆగష్టు 5 2020 రామమందిర నిర్మాణానికి భూమి పూజ
అద్వానీ పాత్ర:
అయోధ్య లో రామమందిర నిర్మాణం కల సాకారంలో కీలక పాత్ర అద్వానీదే. కేసులు .. సుదీర్ఘ విచారణ. ఆ కేసు అడ్డంగా ఉండబట్టే భారత దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవికి అద్వానీ దూరం. నేడు ప్రాణప్రతిష్ట సమయంలో అద్వానీ ఈ కీలక ఘట్టానికి ప్రత్యక్షంగా దూరం అవటం ఒక తీరని వెలితి.
నేడు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం. ప్రాణప్రతిష్ట చేయనున్న మోదీ. హిందువుల మనోభావాలకు ఒక ప్రతీక. ప్రతీ హిందువుకి ఉద్విగ్న క్షణం. భారతీయుల చిరకాల వాంఛ నెరవేరుతున్న శుభసందర్భంలో జై శ్రీరాం! జై శ్రీరాం!!