America : అమెరికాలోని ఎన్ఆర్ఐల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇటీవలి కాలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుసగా యూఎస్ టూర్లు నిర్వహించారు. అక్కడ ఉన్న ఇండియన్స్ తో సమావేశాలు ఏర్పాటు చేసి ఇండియాలో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకు ఎన్ఆర్ఐల సూచనలను తీసుకున్నారు.
ఈ సారి భారతీయ జనతా పార్టీ నుంచి అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకే ఎన్ఆర్ఐతో టచ్ లో ఉంటోంది. ఇండియాలో తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన ఉంచితే.. ఇటీవల 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇండియాలో అట్టహాసంగా జరిగాయి. వీటిని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పడు అమెరికాలో కూడా వేడుకలు నిర్వహించేందుకు సన్నహాలు చేసింది. పార్టీ తరుఫున నిర్వహించే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
అమెరికాలో ఇండియన్ ఇండిపెండెన్స్ పెరేడ్ ను నిర్వహింనున్నారు. ఈ ఆగస్ట్ 20 (ఆదివారం) రోజున మధ్యాహ్నం ఈస్ట్ 18 స్ట్రీట్, న్యూయార్క్, న్యూ జెర్సీ-10016లో 12.15 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కాగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.