India vs Pakistan :
భారత్-పాక్ అంటే క్రికెట్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఏ దేశాలు తలపడినా పట్టించుకోని క్రికెట్ అభిమానులు భారత్ వర్సెస్ పాక్ అంటే మాత్రం స్టేడియంలతో పాటు టీవీలకు అతుక్కొని కూర్చుంటారు. ఇప్పటి వరకు అన్ని ఫార్మట్ లలో పాకిస్తాన్ ను ఓడిస్తున్న భారత్ ఇప్పుడు మరోసారి తలపడేందుకు సిద్ధమైంది.
ఎమర్జింగ్ ఆసియా కప్లో 12వ మ్యాచ్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో బుధవారం (జూలై 19వ తేదీ) జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడిన భారత్ జట్టు మంచి ఫామ్ లో కొనసాగుతోంది. యూఏఈ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో నేపాల్-ఏ జట్టు 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లు సాధించి గ్రూప్-బీ పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది.
మరోవైపు నేపాల్పై పాక్ జూనియర్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందగా, యూఏఈపై 184 రన్స్ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో గ్రూప్-బీలో 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు చివరి లీగ్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచినా లేదా ఓడినా కూడా రెండు జట్లు సెమీఫైనల్కు వెళ్తాయి. గ్రూప్-బీలో ఆడిన 2 మ్యాచ్ల్లో నేపాల్, యూఏఈ ఓడిపోయాయి. దీంతో గ్రూప్-బీ నుంచి భారత్, పాక్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించనున్నాయి.
మధ్యాహ్నం 2 గంటల నుంచి భారత్-పాక్ జూనియర్స్ పోరు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లైవ్ ను ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్సైట్లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఇరు జట్లను పరిశీలిస్తే..
ఇండియా-ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, ప్రదోశ్ రంజన్ పాల్, యశ్ధుల్ (కెప్టెన్), ర్యాన్ పరాగ్, సింధు, నిషాంత్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, హర్షిత్ ఆకాష్ సింగ్, యువరాజ్సింగ్ రానా, నితీశ్ కుమార్ రెడ్డి, రాజవర్దన్ హంగరేకర్.
పాకిస్థాన్-ఏ: మహ్మద్ హారీస్ (కెప్టెన్), ఒమైర్ బిన్ యూసుఫ్, అమద్ భట్, అర్షద్ ఇక్బాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, మెహ్రాన్ ముంతాజ్, ముబాసిర్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సుఫియాన్ తైబ్, సుఫ్యాన్ తైబ్.