Madapur Drug Case : డ్రగ్స్ మహమ్మారి మన టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నోసార్లు డ్రగ్స్ కేసు తెలుగు ఇండస్ట్రీని కుదిపేసింది. అప్పట్లో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుని విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఇవన్నీ ఇంకా నిరూపితం అవ్వకపోయిన ఎప్పటికప్పుడు వారి ట్రెండింగ్ లోకి తెస్తున్నాయి.
మరి మన టాలీవుడ్ లో ఎప్పుడు డ్రగ్స్ పేరు వినిపించిన హీరో నవదీప్ పేరు మాత్రం తప్పకుండ వినిపిస్తుంది. ఈసారి మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా మరోసారి నవదీప్ పేరు వినిపిస్తుంది. నవదీప్ గురించి తెలియని వారు లేరు.. ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.. మంచి మంచి సినిమాల్లో నటించిన నవదీప్ ఇప్పుడు స్పెషల్ రోల్స్ లో నటిస్తూ ఆకట్టు కుంటున్నాడు.
కాగా ఈయన పేరు ముందు నుండి డ్రగ్స్ కేసు చుట్టూనే తిరుగుతుంది. డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ నెల 10న తమ ఎదుట హాజరవ్వాలని పేర్కొంది. ఇటీవలే మాదాపూర్ కేసులో అధిఅక్రూలు ఈయనను విచారించగా ఇదే కేసు విషయంలో మళ్ళీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది.
నవదీప్ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. 2017లో కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో నవదీప్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి వారిని విచారించిన సంగతి తెలిసిందే.. మరి ఇప్పుడు నవదీప్ మరోసారి విచారణకు హాజరవుతుండడం చర్చకు దారి తీస్తుంది.