Volunteers Resignations : రాష్ట్రంలో వాలంటీర్లు మాకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ వీరిని దూరంగా పెట్టిన నేపథ్యంలో వీరి రాజీనామాలు చర్చనీయంగా మారాయి.
కొంతమంది రాజకీయ నాయకులు తమ సేవలకు రాజకీయాలని ఆపాదించి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారని దీంతో మనస్థాపానికి గురై రాజీ నామాలు చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోని 1200 మంది, తాడిపత్రిలో మూడు వేల మంది వాలం టీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది..
వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వినడంతో ఎన్నికల కమిషన్ సంచల నిర్ణయం తీసుకుంది. పెంచల పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయించ కూడదని వారిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది.
దీంతో వాలంటీర్లు అందరూ రాజీ నామా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించే పనిని చేస్తున్న మాకు రాజకీయాలు ఆపాదించడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.