Guntur Karam Mass Looks : మహేశ్ బాబు అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది మిల్కీ బాయ్. తెల్లగా అందంగా మన్మధుడు ఉంటే మహేశ్ బాబు లాగే ఉంటాడేమో అనేంత అందంగా ఉంటాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ మహేశ్ బాబు సినీ కెరీర్ ను మలుపు తిప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా దాదాపు అన్ని ఇండస్ట్రీలలో బక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టింది. ఇందులో మహేశ్ బాబు వీర మాస్ లుక్స్ లో కనిపించాడు.
ఇప్పుడు మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. భారీ బడ్జెట్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఇక ఇందులో మహేశ్ బాబు సరసన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిలు చేస్తున్నారు. సంక్రాంతి-2024న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా దసరా రోజు మహేశ్ అభిమానులకు మేకర్స్ అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు.
గుంటూరు కారంలో మహేశ్ బాబు లుక్స్ కు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. బీడీ కాలుస్తూ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు మహేశ్. పోకిరీ తర్వాత ఆయన ఏ సినిమాలోనూ ఇంత మాస్ గా కనిపించలేదు. ఇంత మాస్ గా కనిపించినా లుక్స్ లో మాత్రం చాలా అందంగా కనిపిస్తారు మహేశ్ బాబు.
పోస్టర్ విడుదలపై కొద్ది సేపటికే నెట్టింట వైరల్ గా మారింది. 2006లో పోకిరీలో సిగరేట్ కాల్చిన మిల్కీ బాయ్ 17 సంవత్సరాల తర్వాత గుంటూరు కారంలో కనిపించనున్నాడు. ఇక ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఆయన సిగరేట్, బీటీ లాంటివి కాల్చలేదు. పాత్ర పరంగా కూడా ఏ సినిమాలో డిమాండ్ లేదు. ఇక గుంటూరు ప్రాంతం నేపథ్యంలో నడుస్తుండడంతో మాస్ అప్పీల్ ఉంటేనే బాగుంటుందని అందుకే మిల్కీ బాయ్ తో త్రివిక్రమ్ బీడీ తాగించాడని తెలుస్తోంది.