KTR Sensational Comments :
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అంశంపై ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై 1.37 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడఅజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు నిజంగా ఎలా ఉంటారో మాకు తెలియదు.. కానీ ఎన్టీఆరే అన్ని మాకు అంటూ పేర్కొన్నారు. దేశంలో తెలుగు వారందరికీ గుర్తింపు తెచ్చిన నేత ఆయననేనన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తునన్నారు. తారక రామారావు పేరు తనకు పెట్టడంఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగానే తెలంగాణ ఆస్తిత్వాన్ని సీఎంకేసీఆర్ దేశవ్యాప్తంగా చాటినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి అంటూ పేర్కొన్నారు. తెలుగు ప్రజల శక్తిని ఢిల్లీకి తాకేలా చేసిన నేత ఎన్టీఆర్ అన్నారు. అందుకే ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇక రానున్న ఎన్నీకల్లో తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పుకొచ్చారు.