OTT Streaming :
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎదిగిన బ్యూటీ లలో అనుష్క శెట్టి ఒకరు.. ఈ భామ తాజాగా ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో సెప్టెంబర్ 7న అంటే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ముందు నుండి డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు.
ఇక ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అనుష్క పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా సెలవు కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశం ఉంది.
దీంతో పాటు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ కూడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. నయనతార, దీపికా పదుకొనె, ప్రియమణి, విజయ్ సేతుపతి వంటి వారు ఈ సినిమా ముందు నుండి భారీ అంచనాలు పెంచేసింది. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
మరి ఒకే రోజు రిలీజ్ అయినా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘జవాన్’ సినిమాలు ఒకే ఓటిటిలో కూడా రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈ రెండు సినిమాల హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం.. నాలుగు వారాల తర్వాతనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. చూడాలి ఈ సినిమాలు థియేటర్ రన్ ఎప్పుడు వరకు ఉంటుందో..
ReplyForward
|