MLA Mahidhar Reddy : ఆంధ్రప్రదేశ్ లో ఐప్యాక్ సభ్యులు,వైసీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిధర్ రెడ్డికి కందుకూరు టిక్కెట్ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేష్, పవన్ ను తిట్టాలని సీఎం జగన్ మాకు కండిషన్ పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా రెండురో జుల క్రితం నాకు టిడిపి అధినేత లను తిట్టాలని నాకు ఆదేశాలు ఇచ్చాయని మహిధర్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై మహిధర్ రెడ్డి స్పందించక పోవడంతో నిన్న మరోసారి తన యింటికి ఐప్యాక్ టీం సభ్యులు వెళ్లారు. దీంతో జగన్ తీరుపై ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం గెలవాలి అంటే మంచి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాల్సిన పార్టీ అధినేత ఈ విధంగా ప్రతిపక్ష నేతలను తిట్టండి అని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే ఐ ప్యాక్ టీం సభ్యులు ఒత్తిడి తీసుకురావడం ఏంటని ఆయన మండిపడుతున్నారు. నిజంగా ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరిగి ఉంటే కచ్చితంగా ప్రజలు పార్టీని ఆదరిస్తారని ఎమ్మెల్యే అన్నారు.
ఇలా ప్రతిపక్ష నేతలను తిడితే పార్టీకి వచ్చే లాభమేంటో మాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదని ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ను బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.