America : స్టూడెంట్ వీసాలపై అమెరికా, కెనడాతో పాటు బ్రిటన్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం స్టూడెంట్ వీసాలపై కొత్త నిబందనలు తీసుకు వచ్చింది. అవి భారతీయ విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేయనున్నాయి. కొత్త నియమాలు విశ్వవిద్యాలయాలకు వర్తించవు, కానీ ప్రధానంగా వృత్తి విద్యా కోర్సులు లేదా విశ్వవిద్యాలయ కోర్సులు చదివే విద్యా కళాశాలలకు మాత్రమే ఇవి వర్తిస్తుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల్లో చాలా మంది పార్ట్ ఉద్యోగాలు చేస్తుంటారు. అలా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తున్నది. ప్రస్తుతం, అటువంటి విద్యార్థులు వారానికి 10 గంటల వరకు పని చేయడాన్ని బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
కారణం ఇదీ..
ఇమ్మిగ్రేషన్ దుర్వినియోగాన్ని నిర్మూలించే ప్రయత్నాలలో భాగంగా 2010 నుంచి 870 కంటే ఎక్కువ బోగస్ కళాశాలల నుంచి స్పాన్సర్షిప్ లైసెన్స్లను హోమ్ ఆఫీస్ తొలగించింది. అటువంటి కళాశాలల్లో ఈయూ యేతర విద్యార్థుల్లో భారతీయులు అతిపెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నారు.
కొన్ని పబ్లిక్గా నిధులు సమకూర్చే కళాశాలల్లో మోసం పెరిగిందన్న ముందస్తు సంకేతాలను అధికారులు గుర్తించారు. తర్వాత ఇమ్మిగ్రేషన్ సలహాదారులు UKలో పని చేయడానికి కళాశాల వీసాల ప్రకటనలను గుర్తించి నిబంధనలను కఠినతరం చేశారు. “ఈ వారంలో కొత్త నిబంధనలను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పని హక్కుల పరిమితులు ఆగస్టు నుంచి అమలు అవుతాయి. ఇతర మార్పులు అమలు చేయబడతాయి.
బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. చదువు పూర్తయ్యేంత వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసా నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు. బ్రిటన్ లో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల్లో అనేకమంది తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తుంటారు. భవిష్యత్తులో కొత్త వీసా నిబంధనలు వారిపై ప్రభావం చూపిస్తాయని భారత ప్రభుత్వం చెబుతున్నది. కొత్త రూల్స్ ప్రకారం… పరిశోధన ప్రోగ్రామ్ గా గుర్తించిన పీజీ కోర్సులో నమోదైతే తప్ప.. తమపై ఆధారపడిన వారిని తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతి ఇవ్వరు. జనవరి 1 – 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భారత ప్రభుత్వం వెల్లడించింది.