SIIMA Awards : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేుక దుబాయి వేదికగా జరుగుతోంది. ఇందులో ఉత్తమ నటుడిగా నందమూరి తారక రామారావు ఎంపికయ్యారు. ఆర్ఆర్ఆర్ లో తన అద్బుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు గెలుచుకున్నారు. దీంతో వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రేక్షక దేవుళ్లకు ఈ సందర్బంగా పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని సమయాల్లో వారు తన వెంట ఉన్నారు. సక్సెస్ లు ఎంజాయ్ చేశారు. ఫెయిల్యూర్స్ ను కూడా సవాలుగా తీసుకున్నారు. తన ఎదుగుదలకు సహకరించిన వారందరికి రుణపడి ఉంటానన్నారు. కిందపడిన ప్రతిసారి పైకి లేపారు. తన వెంట నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో దర్శకుడు రాజమౌళి తనకు కొమురం భీం పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్బుతంగా ఉంది. అందుకే తనకు ఇంతటి గుర్తింపు దక్కింది. సోదరుడు రాంచరణ్ కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. సినిమా విజయంలో ఇద్దరి పాత్రలు ఎంతో దోహదపడ్డాయని భావేద్వేగానికి గురయ్యారు.
ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఇందులో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. తారక్ ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ నటిస్తున్నారట. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇదివరకు గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్రహ్మాండమైన హిట్ గా నిలిచింది.