Nehru : 1948 అప్పటి తాత్కాలిక ప్రధాని నెహ్రూగారు మిలిటరీ అధికారులను ఉద్దేశించి, డియర్ ఫ్ర్రెండ్స్ “మన మిలిటరీలో అనుభవిజ్ఞులైన అధికారులు లేనందున కొన్ని సంవత్సరాలపాటు ఆంగ్లేయులలోనే ఒకరిని ఫీల్డ్ మార్షల్ గా నియమిద్ధామనుకుంటున్నాను..మీ అభిప్రాయం చెప్పండి అని అందరి మొహాలలోకి చూసేడు..అందరూ అలవాటు ప్రకారం వినయంగా తలలూపేశారు.
కానీ నాథూసింగ్ రాథోడ్ అనే అధికారి లేచి వినయంగా రెస్పెక్టెడ్ సార్ “మనదేశంలో ప్రధానిగా పనిచేసిన అనుభవం ఎవరికీ లేదు..కొన్నాళ్ళు ఆంగ్లేయులలోనే ఒకరిని ప్రధానిగా నియమించుకుంటే బాగుంటుంది కదా?? అన్నాడు.అంతే ఆ అధికారులంతా నిశ్చేష్టులైపోయారు..ఊహించని ప్రశ్నకు నెహ్రూగారు కూడా నిర్ఝాంతపోయారు..పిన్ డ్రాప్ సైలెన్స్ … ముందుగా నెహ్రూగారే తేరుకొని”డియర్ సర్,మీరు సైన్యాదక్షుడిగా వుంటారా అని రాధోడ్ తో అన్నారు..అందుకు ఆయన వినయంగా ,సార్ నాకంటే ఎంతో అనుభవం,నైపుణ్యం,ప్రతిభాపాటవాలు కలిగిన అధికారులున్నారు”వారిని నియమించండి అన్నాడు …
మీరే చెప్పండి సార్ అని నెహ్రూగారు అడగగా, సార్! మేజర్ కరియప్ప గారు అందుకు అర్హులు వారిని నియమించండి అని అనగానే అక్కడ అధికారులందరూ చప్పట్లతో అంగీకారం తెలపడం,కరియప్ప గారిని సైనాధ్యక్షునిగా నియమించడం జరిగిపోయింది..ఆయనను మిలటరీ జనరల్ గా నియమించిన రోజును పురస్కరించుకొని జనవరి15 సైనికదినోత్సవంగా మనదేశం జరుపుకుంటుంది.
కరియప్పగారు రెండో ప్రపంచయుద్దంలో ,1947 పాక్ యుద్ధంలోనూ పాల్గోని తన వ్యూహ చతురతను చాటుకొన్నారు..మంచి యుద్ధవ్యూహ రచనా పరుడిగా పేరుతెచ్చుకున్నారు..మనమంతా నిర్భయంగా బతకగలుగుతున్నామంటే సరిహద్దులలో అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్న మన సైన్యుకుల చలువే…సైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేద్దాం!!!