Dharman Shanmugaratnam :
శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్ముగరత్నంకు 70.4 శాతం ఓట్లు రాగా ప్రత్యర్థులైన ఎంగ్ కోక్ సోంగ్, టాన్ కిన్ లియాన్ లకు వరుసగా 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మన్ కు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ ప్రజల నిర్ణయాత్మక ఓట్లు సాధించడంలో ధర్మన్ ప్రజల మనసులు గెలుచుకున్నారని కొనియాడారు.
ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో షణ్ముగరత్నం గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక వేత్త అయిన షణ్ముగరత్నం 2001లో పీపుల్స్ యాక్షన్ పార్టీ లో చేరారు. పలు పదవులు నిర్వహించారు. 2019 వరకు ఉప ప్రధానిగా సేవలందించారు. జులై నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు పాటుపడ్డారు. అందుకే దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
గతంలో తమిళనాడుకు చెందిన సెల్లప్పన్ రామనాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన వాడిగా గుర్తింపు పొందారు. 1981-85 మధ్య మలయాళీ అయిన చెంగర వాటిల్ దేవన్ నాయర్ కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా మన భారత సంతతికి చెందిన వారు సింగపూర్ లో అధ్యక్ష పీఠం ఎక్కి రికార్డులు నెలకొల్పారు. ఇప్పుడు షణ్ముగరత్నం కూడా వారి దారిలోనే నడుస్తున్నారు.