UBlood Diary : యూబ్లడ్.. ఒక యాప్ ప్రాణం పోస్తుందటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే.. నేడు ఎంతో మంది బ్లడ్ లేకుండా, సరైన సమయంలో అందకుండా చనిపోతున్నారు. ఈ ఘటనలు మనకు రోజూ ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటాయి. సరైన సమయంలో బ్లడ్ దొరికితే సదరు వ్యక్తి మరణం నుంచి బయట పడవచ్చు కదా అని భావించిన జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు ఒక యాప్ తయారు చేశారు. అదే ‘యూ బ్లడ్’. ఈ యాప్ లో ఒక్క సారి రిజిస్టర్ చేసుకుంటే చాలు బ్లడ్ పొందవచ్చు.. లేదా బ్లడ్ దానం చేయవచ్చు.
ఈ ఆప్ ఒక సంజీవని అంటూ ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారు. గతంలో కూడా బాబా రాందేవ్ గారు జై యలమంచిలి చేస్తున్న సామాజిక కార్యక్రమాన్ని కీర్తించాడు. దేశంలో ఎంతో మందికి సేవ చేస్తున్న గొప్పవ్యక్తిగా జై గారిని పొగిడారు. ఇక యూబ్లడ్ యాప్ సేవనిరతిని మెచ్చిన రియల్ హీరో సోనూసూద్ స్వయంగా ఈ యాప్ ను ప్రోత్సహిస్తూ.. జై గారి సేవలను కీర్తిస్తూ యూబ్లడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేరారు. ఇక యూబ్లడ్ ను అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రహీరోలు కూడా కొనియాడారు.
ఇప్పుడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం యూబ్లడ్ సేవలను ప్రస్తుతించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఖమ్మం పర్యటనకు వెళుతూ మార్గం మధ్యలో విజయవాడ విమానాశ్రంలో దిగారు. ఈ సందర్భంగా అమిత్ షా గారికి ఏపి బీజేపీ మీడియా కమిటీ చైర్మన్, , గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు ఘన స్వాగతం పలికి.. వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం వివేకానందుడి చిత్రపటంతో ఉన్న ‘యూబ్లడ్’ డైరీని అందజేశారు. దాంతోపాటు వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందించి.. దేశవాళీ ఆవునెయ్యిని బహూకరించారు.
యూబ్లడ్ డైరీని అందుకున్న అమిత్ షా ఈ యూబ్లడ్ గురించి అడిగి తెలుసుకున్నారు. నిస్వార్థంగా, ఉచితంగా సేవలందిస్తున్న ఈ యాప్ ను, నిర్వాహకులను కొనియాడారు.