Purandeshwari : వైసిపి పాలనను అంతం చేసేందుకు టిడిపి జనసేన తో పొత్తు పెట్టుకున్నామని బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నీటిన వైసీపీకి ప్రజల గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తున్నారని అందుకే పేదరికం తగ్గుతోందని పురందేశ్వరి తెలిపారు. మరోసారి మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి మోడీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ను ప్రవేశపెట్టారని అందుకు ప్రజలు బిజెపి వెంటనే ఉన్నారని పురందేశ్వరి తెలిపారు. ఏపీలో కూడా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత అభివృద్ధి ఏంటో చూపిస్తామని పురందే శ్వరి తెలిపారు.