Rashmi Gautam :
రష్మీ.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బుల్లితెర మొత్తానికి స్టార్ యాంకర్ గా రాణిస్తూ దూసుకు పోతుంది. వెండితెరపై హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా ఈమె అక్కడ క్లిక్ అవ్వక పోయిన బుల్లితెర మీద మాత్రం తిరుగులేని మహారాణిగా యాంకరింగ్ లో రాణిస్తుంది.
జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఆ షోతో పాటు ఈటీవీ వారు ఆ తర్వాత స్టార్ట్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఈమెనే యాంకర్ గా కొనసాగుతుంది. ఇలా రెండు షోలతో బిజీ బిజీగా గడుపుతూ నిత్యం బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది..
మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తూ ఉంటారు. ఈసారి కూడా సీరియల్ నటీమణులంతా కలిసి తమకు కాబోయే వరుడు ఎలా ఉండాలి అనే విషయాల గురించి చర్చించు కున్నారు. ఈ వారం ఎపిసోడ్ కు ఇది హైలెట్ గా నిలిచింది. మరి అందరిలో రష్మీ కూడా తనకు కాబోయే భర్తలు ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపారు.
ఈమె మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త మెయిన్ గా చెప్పే మాటలు చేసే పనులతో సింక్ అవ్వాలని తెలిపింది. ఇందుకు హైపర్ ఆది వెంటనే అతడు పక్క ఛానెల్ లో ఉండాలంటూ సెటైర్ వేస్తూ సుధీర్ పేరు ప్రస్తావనకు తెచ్చారు. ఇక ఆ తర్వాత రష్మీ మాట్లాడుతూ చెప్పింది చెయ్యాలి.. చేసేది చెప్పాలి అంటూ చెప్పగా మళ్ళీ హైపర్ ఆది వాడు చేసేవన్నీ చెబితే నువ్వు భరించలేవు అంటూ కౌంటర్ వేసాడు. ఇలా రష్మీ తన మనసులో మాటలు బయట పెట్టేసింది.