అల్లు అర్జున్, రష్మిక మందన చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. మొదటి పార్ట్ దిగ్విజయం కావడంతో రెండో పార్టు షూటింగ్ సాగుతోంది. గతంలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత షూటింగ్ ను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఇక ఫస్ట్ పార్ట్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుసుకదా.. రెండో పార్టు కూడా అంతటి విజయం సాధించాలని టీం బాగా కసరత్తు చేస్తుంది. ఫస్ట్ పార్టులో అల్లు అర్జున్ ను చూసినవారు సెకండ్ పార్ట్ లో చూసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ సనిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. భారీ వ్యూవ్స్ తో అత్యంత వేగంగా జనాల్లోకి వెళ్లిందంటే సందేహం లేదు.
ఇదిలా ఉంటే సుకుమార్, రష్మిక మధ్య షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతుంది. సుకుమార్ షూటింగ్ లొకేషన్ లో గ్యాప్ రావడంతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక హీరోయిన్ గురించి మాట్లాడాడు. అయితే సుకుమార్ గమనించకుండా రష్మిక తన మొబైల్ లో దర్శకుడు మాట్లాడింది రికార్డు చేసింది. తర్వాత వీడియోను సుకుమార్ కు చూపించి సదరు హీరోయిన్ కు పంపుతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుందట.
సుకుమార్ తర్వాత తీసే సినిమాలో కూడా అవకాశం ఇస్తే వీడియోను డిలీట్ చేస్తానని, లేదంటే ఆ హీరోయిన్ కు పంపుతానని బెదిరిస్తుందట. ఇది ఫన్నీగా చేస్తుందా.. ఇందులో ఏమైనా సీరియస్ నెస్ ఉందా అనేది ఇప్పటి వరకూ సుకుమార్ చెప్పలేదు. ఏది ఏమైనా పిచ్చాపాటిగా మాట్లాడుకునేప్పుడు కూడా చుట్టూ చూసుకోవాలన్నమాట.